
న్యూస్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెదేపా 44వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలిపారు. యుగపురుషుడు నందమూరి తారక రామారావు స్థాపించిన తెదేపా తరతరాల తెలుగువారి ఆకాంక్షలకు ప్రతిరూపమని పేర్కొన్నారు. పేదవారికి కూడు, గూడు, గుడ్డ అందించాలన్న సిద్ధాంతాన్ని పార్టీ ఎప్పటికీ కొనసాగిస్తోందని చెప్పారు.
పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కూడా కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, తెలుగువారి ఆత్మగౌరవం కోసం తెదేపా ఏర్పడిందన్నారు. ఎన్టీఆర్ చూపిన మార్గంలో బడుగు, బలహీన వర్గాలకు రాజకీయ, సామాజిక గుర్తింపు తీసుకొచ్చిన పార్టీగా తెదేపా నిలిచిందని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా తెలుగువారిని ముందంజలో నిలపడం లక్ష్యంగా పార్టీ ముందుకు సాగుతోందని అన్నారు.






.webp&w=3840&q=75)















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!