
న్యూస్

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శాసనసభలో కాళేశ్వరం ప్రాజెక్టు విచారణపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యవహారాన్ని సీబీఐకి అప్పగించినప్పటికీ, మాజీ సీఎం కే. చంద్రశేఖర్ రావు మరియు మాజీ మంత్రి హరీశ్ రావుపై ఇప్పటివరకు చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. భాజపా సభ్యులు సభలో సూచనలు ఇచ్చి వెళ్లిపోవడం అలవాటైందని విమర్శించారు.
ధరణి పోర్టల్ ద్వారా జరిగిన భూ అక్రమాలపై హౌస్ కమిటీ వేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం తెలిపారు. మరోవైపు శాసనసభలో బీఆర్ఎస్ సభ్యులు ఆందోళనకు దిగుతూ రాఘవ కన్స్ట్రక్షన్స్ వ్యవహారంపై విచారణ కమిటీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని బర్తరఫ్ చేయాలని నినాదాలు చేస్తూ సభలో ఉద్రిక్తత నెలకొంది.





















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!