
న్యూస్

అమెరికా–ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతల మధ్య కీలక పరిణామం చోటుచేసుకుంది. అంతర్జాతీయ మధ్యవర్తిత్వంతో చర్చలకు తాము సిద్ధమని ఇరాన్ ప్రకటించింది. అయితే చర్చలు ప్రారంభం కావాలంటే తమ విధించిన ఐదు షరతులను తప్పనిసరిగా అంగీకరించాలని స్పష్టం చేసింది.
ఇరాన్ పెట్టిన షరతుల్లో ప్రధానంగా తమ భూభాగంపై, ముఖ్యంగా ఇంధన వనరులపై జరుగుతున్న దాడులను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేసింది. అలాగే ఆర్థిక ఆంక్షలను పూర్తిగా ఎత్తివేయడం, పశ్చిమాసియా నుంచి అమెరికా సైన్యాన్ని ఉపసంహరించుకోవడం, యుద్ధంలో జరిగిన నష్టాలకు పరిహారం చెల్లించడం, తమ దేశ సార్వభౌమాధికారాన్ని గౌరవించాలని కోరింది. ఈ పరిణామం రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గే అవకాశాలను సూచిస్తోంది.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!