
న్యూస్

చైనాలోని షాంగ్జీ ప్రావిన్స్లో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. రాజధాని తైయువాన్ నగరంలోని ఓ భవనంలో మంటలు చెలరేగడంతో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
ఈ ప్రమాదంలో మరో 23 మంది తీవ్రంగా గాయపడగా, వారిలో తొమ్మిది మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. షియావోడియన్ ప్రాంతంలో జరిగిన ఈ ఘటనపై అధికారులు దర్యాప్తు చేపట్టారు. మంటలు ఎలా చెలరేగాయన్న దానిపై స్పష్టత రావాల్సి ఉంది.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!