
సినిమాలు

పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో ఎయిర్ ఇండియా కీలక ప్రకటన చేసింది. ఇజ్రాయెల్కు వెళ్లే అన్ని విమాన సర్వీసులను తాత్కాలికంగా రద్దు చేసినట్లు సంస్థ ప్రకటించింది. ప్రయాణికుల భద్రతను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.
ప్రస్తుత భద్రతా పరిస్థితులను బట్టి తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఈ రద్దు కొనసాగుతుందని ఎయిర్ ఇండియా తెలిపింది. ప్రభావిత ప్రాంతాల్లో అంతర్జాతీయ విమాన రాకపోకలు అంతరాయం ఎదుర్కొంటున్న నేపథ్యంలో ప్రయాణికులు తమ టికెట్లను తిరిగి షెడ్యూల్ చేసుకోవాలని సూచించింది.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!