
న్యూస్

హిందువులకు అక్షయ తృతీయ పర్వదినం ఎంతో పవిత్రమైనది. ఈ రోజున బంగారం, వెండి కొనుగోలు చేస్తే సంపద పెరుగుతుందనే విశ్వాసం ఉంది. అందుకే దేశవ్యాప్తంగా, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు ఆభరణాల దుకాణాల్లో కొనుగోళ్లు పెరుగుతున్నాయి. ప్రస్తుతం బంగారం ధరలు గణనీయంగా ఉన్నప్పటికీ కొనుగోలుదారులు వెనక్కి తగ్గడం లేదు. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,55,780 గా ఉండగా, 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,42,800 గా ఉంది.
ఇక వెండి ధరల విషయానికి వస్తే, హైదరాబాద్లో కిలో వెండి ధర రూ.2,80,000గా నమోదైంది. అక్షయ తృతీయ సందర్భంగా ఈ రోజు బంగారం, వెండి కొనుగోళ్లు మరింత పెరిగే అవకాశం ఉందని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి.


.webp&w=3840&q=75)



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!