
న్యూస్

ఉత్తరాఖండ్లో జరిగే పవిత్ర చార్ధామ్ యాత్రకు ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి. ఈ యాత్రలో భాగంగా యమునోత్రి మరియు గంగోత్రి ఆలయాల గవాక్షాలు అక్షయ తృతీయ సందర్భంగా ఏప్రిల్ 19 న భక్తులకు తెరవనున్నారు. ఆ తరువాత కేదార్నాథ్ ఆలయం ఏప్రిల్ 22 న తెరుచుకోనుండగా, బద్రీనాథ్ ఆలయం ఏప్రిల్ 23 న ఉదయం 6:15 గంటలకు దర్శనానికి అందుబాటులోకి రానుంది.
ఈ యాత్రకు వచ్చే భక్తుల రద్దీని నియంత్రించేందుకు ప్రభుత్వం ఆన్లైన్ రిజిస్ట్రేషన్ను తప్పనిసరి చేసింది. రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మాత్రమే అనుమతి ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు. ప్రతి ఏడాది లక్షలాది మంది భక్తులు ఈ చార్ధామ్ యాత్రలో పాల్గొంటారు. ఈసారి కూడా భారీగా యాత్రికులు రావచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!