
న్యూస్

ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని కాంకేర్ జిల్లా ఛోటే బేథియా ప్రాంతంలో భద్రతా దళాలు మరియు మావోయిస్టుల మధ్య భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఈ కాల్పుల్లో బస్తర్ ప్రాంతంలో పనిచేస్తున్న చివరి తెలుగు మావోయిస్టుగా గుర్తింపు పొందిన రూపీరెడ్డి మృతి చెందారు. ఘటన స్థలంలో భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు కాంకేర్ ఎస్పీ తెలిపారు. కాల్పుల సమయంలో మరికొందరు మావోయిస్టులు అక్కడి నుంచి పరారయ్యారు.
రూపీరెడ్డి నార్త్ బస్తర్ ఏరియా కమిటీ సభ్యురాలిగా ఉన్నారు. ఆమె భర్త విజయ్ రెడ్డి 2025లో జరిగిన ఎన్కౌంటర్లో మరణించారు. ప్రస్తుతం పరారీలో ఉన్న మావోయిస్టుల కోసం భద్రతా దళాలు కంబింగ్ ఆపరేషన్లు కొనసాగిస్తున్నాయి.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!