
సినిమాలు

ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు తీవ్రంగా పెరిగి 45 డిగ్రీల మార్క్ను దాటాయి. కడప జిల్లాలో అత్యధికంగా 45.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదు కావడం గమనార్హం. దీంతో రాష్ట్రంలో వేడి తీవ్రత మరింత పెరిగిన పరిస్థితి కనిపిస్తోంది.
నెల్లూరు, మార్కాపురం, కాకినాడ, పల్నాడు జిల్లాల్లో 43 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అలాగే కర్నూలు, తిరుపతి, సత్యసాయి జిల్లాల్లో కూడా 43 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు రికార్డ్ అయ్యాయి. ఈ తీవ్ర వేడి కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచిస్తోంది.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!