
క్రీడలు

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆరోగ్య పరిస్థితిపై ప్రధాని నరేంద్ర మోదీ ఆరా తీశారు. ఇటీవల శస్త్రచికిత్స అనంతరం విశ్రాంతి తీసుకుంటున్న పవన్ కళ్యాణ్తో ఫోన్లో మాట్లాడిన ప్రధాని, ఆయన ఆరోగ్యం గురించి తెలుసుకున్నారు. పవన్ ధైర్యంగా ఉన్నారని, త్వరగా కోలుకుంటారని ఆశాభావం వ్యక్తం చేస్తూ ఆయన ఆరోగ్యం కోసం ప్రార్థిస్తున్నానని సోషల్ మీడియాలో పేర్కొన్నారు.
ప్రధాని స్పందనకు పవన్ కళ్యాణ్ కృతజ్ఞతలు తెలిపారు. తన ఆరోగ్యంపై శ్రద్ధ చూపినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, ప్రధాని ఇచ్చిన ప్రోత్సాహం, ఆశీస్సులు తనకు మరింత బలం ఇస్తాయని అన్నారు. భవిష్యత్తులో కూడా మార్గదర్శకత్వం, మద్దతు కొనసాగాలని ఆకాంక్షిస్తూ, త్వరగా కోలుకుని సేవలు కొనసాగిస్తానని వెల్లడించారు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!