

హోర్ముజ్ జలసంధిలో భారత జెండా కింద నడిచే వాణిజ్య నౌకల పై కాల్పులు జరగడం ఆందోళన కలిగిస్తోంది. ఈ ఘటన పై తీవ్ర నిరసన వ్యక్తం చేస్తూ భారత్ ప్రభుత్వం ఇరాన్ రాయబారిని పిలిపించింది. అధికారిక సమాచారం ప్రకారం, ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్కు చెందిన గన్బోట్లు ఈ నౌకల పై కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. దీంతో నౌకలు వెనక్కి తిరగాల్సి వచ్చింది. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు.
విదేశాంగ మంత్రిత్వ శాఖ ఈ విషయంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. అంతర్జాతీయ జలాల్లో భారత నౌకలు, సిబ్బంది భద్రతను నిర్ధారించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసింది. విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రి ఇరాన్ ప్రతినిధిని కలుసుకుని, భారత నౌకలకు ఎటువంటి అంతరాయం లేకుండా సురక్షిత ప్రయాణం కల్పించాలని కోరారు.
ప్రస్తుతం ప్రాంతంలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ ఘటన ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రపంచ వ్యాప్తంగా చమురు రవాణాకు కీలక మార్గమైన హోర్ముజ్ జలసంధిలో ఇలాంటి ఘటనలు అంతర్జాతీయ వాణిజ్యంపై ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!