
న్యూస్

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) 2025–26 ఆర్థిక సంవత్సరంలో తిరుమల లడ్డూ ప్రసాదం విక్రయాల్లో సరికొత్త చరిత్ర సృష్టించింది. మొత్తం 13.95 కోట్ల లడ్డూలను విక్రయించి సుమారు రూ.567 కోట్ల ఆదాయం ఆర్జించింది. రోజుకు సగటున 4 లక్షల లడ్డూలను తయారు చేసి విక్రయిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇది తిరుమలలో భక్తుల భారీ రద్దీని ప్రతిబింబిస్తోంది.
ఎన్ని వివాదాలు, రాజకీయ చర్చలు జరిగినా శ్రీ వేంకటేశ్వర స్వామి ప్రసాదమైన లడ్డూకు ఉన్న పవిత్రత, విశ్వాసం ఏమాత్రం తగ్గడం లేదు. భక్తులకు లడ్డూ ప్రత్యేకమైన ఆధ్యాత్మిక అనుభూతిని ఇస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ఈ లడ్డూ తన ప్రత్యేక రుచి, ప్రాముఖ్యతతో మరోసారి రికార్డు సృష్టించింది.



.jpg&w=3840&q=75)


















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!