

రెవెన్యూ శాఖ సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 2027 మార్చి నాటికి రీ సర్వే 2.0 పూర్తి చేసి మొత్తం 1.12 కోట్ల కొత్త పట్టాదారు పాస్పుస్తకాలను పంపిణీ చేయాలని అధికారులను ఆదేశించారు. ఇప్పటికే 6,976 గ్రామాల్లో సర్వే పూర్తి కాగా, 5,717 గ్రామాల్లో 22.79 లక్షల పాస్పుస్తకాల పంపిణీ జరుగుతోంది. మిగిలిన 1,259 గ్రామాల్లో 9 లక్షల పాస్పుస్తకాలను ఈ ఏడాది జూలై నాటికి అందించాలని సూచించారు. అనంతరం వచ్చే ఏడాది మార్చి నాటికి మొత్తం ప్రక్రియను పూర్తి చేసి, తప్పులకు ఆస్కారం లేకుండా పాస్పుస్తకాలు ఇవ్వాలని స్పష్టం చేశారు.
అదేవిధంగా, లక్షలాది కుటుంబాలకు ఊరటనిచ్చేలా 1.37 లక్షల ఎకరాల విలేజ్ సర్వీస్ ఇనాం భూములను 22ఏ నుంచి తొలగించే నిర్ణయం తీసుకున్నారు. మరో లక్ష ఎకరాల సర్వీస్ ఇనాం భూములకు కూడా విముక్తి కల్పించేందుకు కొత్త చట్టం తీసుకురావాలని ఆదేశించారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఈ సమస్యలు పెరిగాయని, ఇప్పుడు ప్రజలకు న్యాయం చేసే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని సీఎం తెలిపారు.





















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!