

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ, జస్టిస్ పి.సి. ఘోష్ కమిషన్ నివేదికపై హైకోర్టు ఇచ్చిన తీర్పు కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్లో జరిగిన అవినీతి విచారణకు లేదా సీబీఐ దర్యాప్తుకు ఎలాంటి అడ్డంకి కాదని స్పష్టం చేశారు. అభియోగాలు ఎదుర్కొంటున్న వారికి తమ వాదనలు వినిపించే అవకాశం ఇవ్వడంలో సాంకేతిక లోపాలు ఉన్నాయని మాత్రమే కోర్టు పేర్కొందని తెలిపారు. ఈ నివేదిక ఆధారంగా తక్షణ చర్యలు తీసుకోకూడదని చెప్పినప్పటికీ, ఎవరినీ నిర్దోషులుగా తేల్చలేదని ఆయన వివరించారు.
కమిషన్ నివేదికతో పాటు విజిలెన్స్ కమిషన్, ఎన్డీఎస్ఏ నివేదికలు కూడా ప్రాజెక్టులో లోపాలు, అవకతవకలు స్పష్టంగా చూపిస్తున్నాయని ఆయన అన్నారు. హైకోర్టు తీర్పులో భారాస నాయకులను నిర్దోషులుగా ప్రకటించలేదని, అవినీతి లేదని చెప్పలేదని పేర్కొన్నారు. ఈ తీర్పు సీబీఐ విచారణకు ఎలాంటి అడ్డంకి కాదని స్పష్టం చేశారు. కేంద్రం సీబీఐ విచారణ ప్రారంభించకపోతే దిల్లీలో ఆందోళనకు సిద్ధమని హెచ్చరించారు. కేంద్ర మంత్రి కిషన్రెడ్డిని కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని కోరారు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!