

తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా పథకం కింద రెండోవిడత నిధులను విడుదల చేసింది. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈ వివరాలు వెల్లడించారు. ఈ విడతలో నలభై ఐదు లక్షల పదకొండు వేల తొమ్మిది వందల నలభై ఏడు మంది రైతులు లబ్ధి పొందనున్నారని తెలిపారు. ఈ రోజు రైతుల బ్యాంకు ఖాతాల్లో రెండు వేల రెండు వందల ఆరు కోట్లు జమ కానున్నాయని చెప్పారు.
ఇంతకుముందు నర్మెట్టలో ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవ సమయంలో మొదటి విడతలో మూడు వేల నాలుగు వందల నలభై ఆరు కోట్లు విడుదల చేసినట్లు తెలిపారు. రెండు విడతలను కలిపి ఇప్పటివరకు మొత్తం ఐదు వేల ఆరు వందల యాభై మూడు కోట్లు రైతు భరోసా పథకం కింద ఇచ్చినట్లు చెప్పారు. దీని ద్వారా మొత్తం డెబ్బై ఒక లక్షల ఆరు వేల మంది రైతులు లబ్ధి పొందారని తెలిపారు.
రైతుల సంక్షేమమే ప్రభుత్వానికి మొదటి ప్రాధాన్యం అని, వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేస్తామని మంత్రి స్పష్టం చేశారు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!