

ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం పై దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలో, ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసులో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుడు కొండల్ రెడ్డికి SIT నోటీసులు జారీ చేసింది. అలాగే, బీఆరెస్ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యేలు జైపాల్ యాదవ్ మరియు చిరుమర్తి లింగయ్య లకు కూడా విచారణకు హాజరుకావాలంటూ SIT పిలుపునిచ్చింది.
దర్యాప్తులో భాగంగా, 2023 నవంబర్ 15 నుంచి 30 వరకు ఫోన్ ట్యాపింగ్కు సంబంధించిన నంబర్ల ఆధారంగా ఇప్పటికే పలువురి స్టేట్మెంట్లు నమోదు చేసినట్లు సమాచారం. ప్రస్తుతం ఆ స్టేట్మెంట్లను మరోసారి సమగ్రంగా పరిశీలిస్తున్నట్లు SIT వర్గాలు తెలిపాయి.
ఈ నేపథ్యంలో, సంబంధిత వ్యక్తులు రేపు ఉదయం 11 గంటలకు విచారణకు హాజరుకావాలని SIT స్పష్టంగా సూచించింది. ఫోన్ ట్యాపింగ్ అంశం పై దర్యాప్తు మరింత లోతుగా సాగుతున్నట్లు తెలుస్తోంది.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!