
జనరల్

అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే శనివారం రాత్రి హైదరాబాద్లోని శంషాబాద్ నోవాటెల్ హోటల్లో బస చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సహా పలువురు కాంగ్రెస్ నాయకులు ఖర్గేను మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ, రాజకీయ అంశాలపై కూడా చర్చలు జరిగినట్లు సమాచారం.
ఆదివారం ఉదయం ఖర్గే రోడ్డు మార్గాన కర్ణాటకలోని తన నియోజకవర్గానికి బయలుదేరారు. తెలంగాణ సరిహద్దుకు ఆనుకుని ఉన్న తన నియోజకవర్గానికి వెళ్లేందుకు ఆయన ఢిల్లీ నుంచి విమానంలో శంషాబాద్కు చేరుకున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ కాంగ్రెస్ నేతలకు పార్టీ జాతీయ నాయకత్వంతో సమావేశమయ్యే అవకాశం లభించింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!