

సీబీఎస్ఈ ఆన్స్క్రీన్ మార్కింగ్ వివాదంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై మరోసారి విమర్శలు గుప్పించారు. మూల్యాంకన విధానంపై ప్రశ్నలు లేవనెత్తిన విద్యార్థులతో తన సంభాషణకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పంచుకున్న ఆయన, లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన అంశంపై కేంద్రం సరైన స్పందన ఇవ్వడం లేదని ఆరోపించారు. ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో పలు అంశాలపై మాట్లాడే ప్రధాని నరేంద్ర మోదీ, విద్యార్థుల ఆందోళనలపై స్పందించలేదని విమర్శించారు.
సీబీఎస్ఈ టెండర్ నిబంధనల్లో మార్పులు చేయడం వల్లే మూల్యాంకన ప్రక్రియలో లోపాలు తలెత్తాయని రాహుల్ గాంధీ ఆరోపించారు. ఆన్సర్ షీట్ల డిజిటలైజేషన్, స్కానింగ్ ప్రక్రియలో జరిగిన మార్పులు విద్యార్థులపై ప్రభావం చూపాయని పేర్కొన్నారు. కేంద్ర విద్యాశాఖ, సంబంధిత అధికారులు ఈ అంశంపై స్పష్టమైన సమాధానాలు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. మరోవైపు, ఆన్మార్క్ పోర్టల్కు సంబంధించిన సాంకేతిక అంశాలను పరిశీలిస్తున్నట్లు సీబీఎస్ఈ ఇప్పటికే వెల్లడించింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!