

ఐపీఎల్ 2026 సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మరోసారి తమ సత్తా చాటింది. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఫైనల్లో గుజరాత్ టైటాన్స్ను ఐదు వికెట్ల తేడాతో ఓడించి వరుసగా రెండోసారి టైటిల్ను కైవసం చేసుకుంది. ముందుగా బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ను 155/8 స్కోరుకే పరిమితం చేసిన ఆర్సీబీ బౌలర్లు మ్యాచ్పై పూర్తి ఆధిపత్యం చాటారు. భువనేశ్వర్ కుమార్ రెండు వికెట్లు, రసిఖ్ సలాం దార్ మూడు వికెట్లు తీసి గుజరాత్ బ్యాటింగ్ను దెబ్బతీశారు.
156 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బెంగళూరు జట్టుకు వెంకటేశ్ అయ్యర్, విరాట్ కోహ్లీ శుభారంభం అందించారు. అయ్యర్ వేగంగా 32 పరుగులు చేయగా, కోహ్లీ అజేయంగా 75 పరుగులు చేసి జట్టును విజయతీరాలకు చేర్చాడు. రషీద్ ఖాన్ రెండు కీలక వికెట్లు తీసి గుజరాత్కు ఆశలు కల్పించినా, టిమ్ డేవిడ్ మరియు జితేశ్ శర్మ సహకారంతో ఆర్సీబీ 18 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది.

గుజరాత్ టైటాన్స్ తరఫున వాషింగ్టన్ సుందర్ ఒంటరి పోరాటం చేస్తూ అజేయ అర్ధశతకం నమోదు చేశాడు. అయితే మిగతా బ్యాటర్లు విఫలం కావడంతో జట్టు పోటీ స్కోరుకు చేరుకోలేకపోయింది. క్వాలిఫయర్-1లోనూ గుజరాత్ను ఓడించిన ఆర్సీబీ, ఫైనల్లోనూ అదే జోరును కొనసాగించి మరోసారి ఐపీఎల్ కప్ను ముద్దాడింది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!