
క్రీడలు

ఆర్టీసీ ఉద్యోగుల సమ్మె సమయంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. వరంగల్ జిల్లా నర్సంపేటలో ఈ మధ్యాహ్నం పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించిన ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ ప్రాణాలు కోల్పోయారు. తీవ్రంగా కాలిన గాయాలతో ఉన్న ఆయనను మొదట వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో హైదరాబాద్కు తీసుకెళ్తుండగా కర్మాన్ఘాట్ సమీపంలోనే ఆయన కన్నుమూశారు.
ప్రస్తుతం ఆయన మృతదేహం కంచన్బాగ్లోని డీఆర్డీఓ అపోలో ఆస్పత్రిలో ఉన్నట్లు సమాచారం.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!