

తమిళనాడు ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఈసారి రాష్ట్రంలో ముక్కోణపు పోటీ నెలకొనగా, డీఎంకే, అన్నాడీఎంకేతో పాటు కోలీవుడ్ స్టార్ విజయ్ స్థాపించిన ‘తమిళగ వెట్రి కళగం (టీవీకే)’ పార్టీ కూడా తొలిసారి ఎన్నికల బరిలోకి దిగింది. దీంతో సామాన్య ఓటర్లతో పాటు సినీ, రాజకీయ ప్రముఖులు పెద్ద సంఖ్యలో పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. టీవీకే అధినేత విజయ్తో పాటు రజనీకాంత్, అజిత్, ధనుష్, శ్రుతి హాసన్, కమల్ హాసన్, త్రిష, ఖుష్బూ, శివ కార్తికేయన్, దర్శకుడు అట్లీ తదితర ప్రముఖులు తమ తమ పోలింగ్ కేంద్రాల్లో ఓటు వేశారు. అయితే ఈ ఎన్నికల్లో ప్రత్యేకంగా అందరి దృష్టిని ఆకర్షించింది హీరోయిన్ త్రిషే.
ఎన్నికలకు ముందు విజయ్తో త్రిష రిలేషన్లో ఉన్నారనే రూమర్లు, అలాగే వారు కలిసి ఒక ఫంక్షన్లో కనిపించడం వంటి అంశాలు సోషల్ మీడియాలో చర్చనీయాంశమయ్యాయి. ఈ నేపథ్యంలో ఆమె ఓటు వేయడానికి రావడంతో మీడియా ప్రత్యేక దృష్టి పెట్టింది. త్రిష చెన్నైలో తన తల్లితో కలిసి ఓటు వేసి, సిరా గుర్తు చూపిస్తూ ఫోటోను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసింది. ఆ పోస్ట్లో ఆమె ‘గిల్లి’ సినిమాలోని విజయ్తో నటించిన ‘అర్జునర్ విల్లు’ పాటను, ముఖ్యంగా విజిల్ భాగాన్ని జత చేయడం మరింత చర్చకు దారితీసింది. విజయ్ పార్టీ గుర్తు కూడా విజిల్ కావడంతో, ఈ పోస్ట్ ద్వారా త్రిష పరోక్షంగా టీవీకేకు మద్దతు తెలిపిందని నెటిజన్లు భావిస్తున్నారు. దీంతో విజయ్ అభిమానులు ఆమెను సరదాగా ‘వదినమ్మ’ అని పిలుస్తూ కామెంట్లు చేస్తున్నారు. ఎన్నికల ఫలితాల తర్వాత విజయ్-త్రిష వివాహంపై కూడా ఊహాగానాలు వినిపిస్తున్నాయి.







.avif&w=3840&q=75)














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!