

అమెరికా-ఇరాన్ రెండో విడత చర్చలకు రాయబారం కొనసాగుతున్న సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. హర్ముజ్ జలసంధి పరిణామాలపై స్పందించిన ఆయన, జలసంధిలో మందుపాతరలు ఏర్పాటు చేయడానికి ప్రయత్నించే ఏ నౌకలైనా తక్షణమే ధ్వంసం చేయాలని యునైటెడ్ స్టేట్స్ నేవీని ఆదేశించినట్లు వెల్లడించారు. ఈ వ్యాఖ్యలు అంతర్జాతీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. ఇదే సమయంలో హర్ముజ్ జలసంధిలో తొలిసారిగా పన్ను వసూలు చేసినట్లు ఇరాన్ ప్రకటించింది. అమెరికా బ్లాకేడ్కు ప్రతిస్పందనగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.
ట్రంప్ తన ట్రూత్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ, హర్ముజ్ జలసంధిలో ప్రయాణించే అనుమానాస్పద బోట్లు చిన్నవైనా పెద్దవైనా కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం అక్కడ అమెరికా మైన్ క్లియరింగ్ కార్యకలాపాలు కొనసాగుతున్నాయని, వాటిని మరింత వేగవంతం చేయాలని సూచించారు. అదనంగా మరిన్ని మైన్ స్వీపర్ నౌకలను హర్ముజ్ ప్రాంతానికి పంపించాలని కూడా ఆదేశించినట్లు సమాచారం. ఈ పరిణామాల నేపథ్యంలో పశ్చిమాసియాలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!