
న్యూస్

సింహాచలం దేవస్థానంలో చందనోత్సవ వేడుకలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. భారీ సంఖ్యలో భక్తులు స్వామివారి దర్శనానికి తరలి వచ్చారు. రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత ప్రభుత్వం తరఫున స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించి కుటుంబ సమేతంగా దర్శనం చేసుకున్నారు. అనువంశిక ధర్మకర్త పూసపాటి అశోక్ గజపతి రాజు తొలి దర్శనం అనంతరం సాధారణ భక్తులకు అనుమతి ఇచ్చారు.
హోం మంత్రి మాట్లాడుతూ స్వామివారి అనుగ్రహం, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆశీస్సులతో పట్టు వస్త్రాలు సమర్పించినట్లు తెలిపారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. సుమారు 3 వేల మంది పోలీసులు భద్రత పర్యవేక్షణలో పాల్గొంటున్నారు. క్యూ లైన్లను స్వయంగా పరిశీలించిన హోం మంత్రి, ఉదయం 3 నుంచి 4.30 గంటల మధ్య 6700 మంది భక్తులు దర్శనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!