
తెలంగాణలో పలుచోట్ల ఈ రోజు రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆకాశం నిర్మలంగా ఉండటంతో వేడి మరింత పెరిగింది. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో ఉష్ణోగ్రతలు 37°C నుండి 38°C వరకు నమోదై తీవ్ర ఎండలు కనిపించాయి.
ఉత్తర మరియు తూర్పు తెలంగాణ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 39°C నుండి 41°C వరకు నమోదయ్యాయి. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, ములుగు, మంచిర్యాల, వరంగల్, ఆదిలాబాద్, కొమరం భీమ్, ఆసిఫాబాద్, జగిత్యాల జిల్లాల్లో తీవ్ర ఎండలు నమోదయ్యాయి. వచ్చే మూడు నుంచి నాలుగు రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగవచ్చని వాతావరణ అధికారులు చెబుతున్నారు. మధ్యాహ్నం ప్రయాణాలు చేయాలనుకునేవారు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.









.avif&w=3840&q=75)
కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!