
.jpeg&w=3840&q=75)
ఇంటర్మీడియట్ పరీక్షల్లో ఫెయిల్ అవుతాననే భయంతో విశాఖపట్నానికి చెందిన ద్వితీయ సంవత్సరం విద్యార్థి బుధవారం ఫలితాలు వెలువడకముందే బోర్డు అధికారులకు ఫోన్ చేశాడు. తనను ఏదోవిధంగా పాస్ చేయాలని కోరుతూ, జవాబు పత్రాల్లో డబ్బులు పెట్టానని, ఏమీ చదవకపోవడంతో ఒకే ప్రశ్నాపత్రాన్ని మూడుసార్లు రాసానని తెలిపాడు. ఈ ఘటన విద్యార్థులపై ఉన్న పరీక్షల ఒత్తిడిని మరోసారి బయటపెట్టింది.
విద్యార్థితో ఫోన్లోనే మాట్లాడిన అధికారులు, త్వరలో జరగనున్న అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు బాగా సిద్ధమవ్వాలని సూచిస్తూ కౌన్సెలింగ్ చేశారు. అనంతరం విశాఖ ఆర్ఐఓకు సమాచారం అందించి, విద్యార్థి తల్లిదండ్రులకు తెలియజేయాలని ఆదేశించారు. జిల్లా అధికారులు తల్లిదండ్రులతో మాట్లాడగా, విద్యార్థి ఇంట్లోనే ఉన్నాడని, అతడిని జాగ్రత్తగా చూసుకుంటామని తెలిపారు. ఈ విద్యార్థి మొదటి ఏడాదిలో రెండు సబ్జెక్టులు, ద్వితీయ సంవత్సరంలో మూడు సబ్జెక్టులు ఫెయిల్ అయినట్లు సమాచారం.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!