
ఆరోగ్యం
.jpeg&w=3840&q=75)
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) తిరుమలలో ఇంధన కొరత లేదని భక్తులకు స్పష్టం చేసింది. ఆదివారం మధ్యాహ్నం తిరుమలలోని హెచ్పి, ఐఓసీఎల్ పెట్రోల్ బంకుల్లో పెట్రోల్ తాత్కాలికంగా అయిపోవడంతో “నో స్టాక్” బోర్డులు ఏర్పాటు చేయడం జరిగింది. దీంతో భక్తులు, ప్రయాణికుల్లో కొంత ఆందోళన నెలకొంది.
అయితే సాయంత్రానికి హెచ్పి పెట్రోల్ బంక్కు ట్యాంకర్ చేరడంతో ఇంధనం అందుబాటులోకి వచ్చింది. రేపు ఉదయానికి ఐఓసీఎల్ బంక్కు కూడా ట్యాంకర్ చేరుతుందని అధికారులు తెలిపారు. టీటీడీ అదనపు ఈవో సి.హెచ్. వెంకయ్య చౌదరి భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని డీలర్లకు సూచించారు.













.jpeg&w=3840&q=75)



.webp&w=3840&q=75)




కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!