

తమిళ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ సంచలన నిర్ణయం తీసుకుంది. భారీ బడ్జెట్ చిత్రాల నిర్మాణ విధానంలో కీలక మార్పులు చేపట్టాలని తాజాగా జరిగిన సమావేశంలో తీర్మానించింది. ఇప్పటివరకు నటీనటులకు వారి క్రేజ్, డిమాండ్ ఆధారంగా ముందుగానే పారితోషికం చెల్లించే విధానం అమల్లో ఉండగా, ఇకపై రెవెన్యూ షేరింగ్ మోడల్ను ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. ఈ విధానంలో నిర్మాతలతో పాటు నటీనటులు కూడా సినిమా లాభనష్టాలను పంచుకోవాల్సి ఉంటుంది.
మే 2న ఒకరోజు సమ్మెను ప్రకటించిన నిర్మాతల మండలి, ఈ నిర్ణయాలకు నాందిగా దీన్ని భావిస్తోంది. నడిగర్ సంఘం సహకారం లభించకపోతే సమ్మె పూర్తి స్థాయికి చేరే అవకాశముందని తెలుస్తోంది. అలాగే థియేట్రికల్ విడుదల తర్వాత సినిమాలను ఓటీటీలో విడుదల చేయడానికి కనీసం 6 నుంచి 8 వారాల గడువు ఉండాలని నిర్ణయించింది. ఈ మోడల్ను ఇప్పటికే గతంలో ప్రతిపాదించినప్పటికీ పెద్దగా స్పందన రాలేదు. అయితే ఇటీవల ఈ విధానాన్ని అనుసరించిన కొన్ని సినిమాల వల్ల నిర్మాతలకు నష్టభారం తగ్గినట్లు సమాచారం.






.jpeg&w=3840&q=75)






.jpeg&w=3840&q=75)



.webp&w=3840&q=75)




కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!