
.png&w=3840&q=75)
ప్రస్తుత టోల్ వసూలు వ్యవస్థ త్వరలో దేశం నుంచి పూర్తిగా తొలగించబడుతుందని కేంద్ర రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు. ఇప్పటికే ప్రయోగాత్మకంగా 10 ప్రాంతాల్లో అమలు చేస్తున్న ఈ సరికొత్త టెక్నాలజీ అద్భుత ఫలితాలు ఇస్తోందని ఆయన తెలిపారు. వచ్చే ఏడాదిలోపే సంప్రదాయ టోల్ గేట్లను పూర్తిగా రీప్లేస్ చేస్తూ, దేశవ్యాప్తంగా ఈ కొత్త వ్యవస్థను ప్రవేశపెట్టే పనులు వేగంగా జరుగుతున్నాయని లోక్సభలో వివరించారు. ప్రస్తుతం టోల్ గేట్ల వద్ద ఏర్పడే భారీ ట్రాఫిక్, ప్రయాణ సమయ నష్టం మరియు ఇంధన వ్యర్థంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని చెప్పుకొచ్చారు.
ఈ ఆధునిక వ్యవస్థలో ఉపగ్రహాల సాయంతో టోల్ ఎంపిక (Satellite-based Tolling) చేయనున్నారు. అంటే వాహనం టోల్ గేట్ వద్ద ఆగాల్సిన అవసరం లేకుండా, GPS ఆధారంగా ప్రయాణించిన దూరాన్ని లెక్కించి ఆటోమేటిగ్గా టోల్ అమౌంట్ కట్ అవుతుంది. ఇలా రోడ్డు ప్రయాణం మరింత వేగంగా, ఇబ్బందిలేకుండా సాగుతుందని మంత్రి తెలిపారు. ఈ మార్పు అమల్లోకి వస్తే, టోల్ ప్లాజాల వద్ద కనిపించే భారీ క్యూలు, హారన్ సౌండ్, టైమ్ వేస్ట్ అన్నీ గతం కానున్నాయి. దేశవ్యాప్తంగా రోడ్డు రాకపోకల వ్యవస్థను పూర్తిగా మార్చేస్తున్న విప్లవాత్మక నిర్ణయంగా అధికారులు వెల్లడిస్తున్నారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!