
సినిమాలు

విజయవాడలో ఘనంగా నిర్వహించిన ‘పెద్ది’ ప్రీ-రిలీజ్ ఈవెంట్లో హీరో రామ్ చరణ్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ కార్యక్రమానికి అభిమానులు భారీ సంఖ్యలో హాజరుకాగా, ఏఆర్ రెహమాన్ లైవ్ ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ సందర్భంగా రామ్ చరణ్ మాట్లాడుతూ, తన కెరీర్లో అనేక కథలు విన్నప్పటికీ చాలా తక్కువ కథలే మనసును తాకుతాయని, అలాంటి అరుదైన కథల్లో ‘పెద్ది’ ఒకటని పేర్కొన్నారు.
దర్శకుడు బుచ్చిబాబు ఈ కథను వినిపించినప్పుడు తాను ఆశ్చర్యపోయానని, ఇలాంటి ఆలోచనలు ఎలా వస్తాయో అనిపించిందని చరణ్ తెలిపారు. అలాగే బుచ్చిబాబు భవిష్యత్తులో భారతదేశంలోని టాప్ దర్శకుల్లో ఒకరిగా నిలుస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. నిర్మాత వెంకట సతీష్ కిలారు పనితీరును కూడా ప్రశంసిస్తూ, తొలి సినిమా అయినప్పటికీ ఎంతో అనుభవం ఉన్న నిర్మాతలా వ్యవహరించారని కొనియాడారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!