

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యవసాయం మరియు పారిశ్రామిక రంగాల్లో ఉపయోగించే పరికరాలపై దిగుమతి సుంకాలను 25 శాతం నుంచి 15 శాతానికి తగ్గించారు. ఈ తగ్గింపు వచ్చే ఏడాది చివరి వరకు అమల్లో ఉండనుంది. హార్వెస్టర్లు వంటి వ్యవసాయ యంత్రాలు, ఇతర పరికరాల దిగుమతులకు ఇది వర్తిస్తుంది. వ్యవసాయ రంగంలో పెట్టుబడులను ప్రోత్సహించడంతో పాటు ఉత్పత్తి ఖర్చులను తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అదేవిధంగా బుల్డోజర్లు, ఫోర్క్లిఫ్ట్లు వంటి పారిశ్రామిక పరికరాలపై కూడా ఈ సుంకం తగ్గింపు వర్తించనుంది. అమెరికాతో వాణిజ్య ఒప్పందాలు ఉన్న దేశాలకు కూడా ఈ ప్రయోజనం లభిస్తుంది.
అమెరికా లోహ రంగాన్ని బలోపేతం చేయడానికి శ్వేతసౌధం మరో ప్రోత్సాహకాన్ని ప్రకటించింది. విదేశీ సంస్థలు దిగుమతి చేసే మూలధన పరికరాల్లో కనీసం 85 శాతం అమెరికా నుంచి వచ్చిన స్టీల్, అల్యూమినియం వాడితే కేవలం 10 శాతం సుంకం మాత్రమే విధించబడుతుంది. ఈ రాయితీలు డిసెంబర్ 2027 వరకు కొనసాగుతాయని తెలిపారు. దేశీయ పరిశ్రమలను రక్షించడం, జాతీయ భద్రతను కాపాడటం లక్ష్యంగా ఈ చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు. భారతదేశానికి చెందిన మహీంద్రా అండ్ మహీంద్రా, టీఏఎఫ్ఈ, శక్తిమాన్, ఫీల్డ్కింగ్, జైన్ ఇరిగేషన్ వంటి సంస్థలకు ఈ నిర్ణయం వల్ల కొంతమేరకు లాభం కలగవచ్చు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!