
బిజినెస్

స్వయం సహాయక సంఘాల బలోపేతానికి రాష్ట్రవ్యాప్తంగా మహిళా శక్తి సూపర్ బజార్లు, లాజిస్టిక్స్ హబ్లు, రైస్ మిల్లులు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా సెర్ప్ కార్యాచరణ రూపొందిస్తోంది.
ముందుగా హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, ఖమ్మం, నల్గొండ, సంగారెడ్డి వంటి తొమ్మిది ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో ఒక్కో సూపర్ బజార్ ఏర్పాటు చేయనున్నారు. ఖమ్మంలో లాజిస్టిక్స్ హబ్, గోదాము, రైస్ మిల్లు ఏర్పాటు కోసం 20 ఎకరాల భూమి కేటాయింపుపై ప్రతిపాదనలు సిద్ధం చేశారు. మహిళా సమాఖ్యలకే ఈ కేంద్రాల నిర్వహణ బాధ్యతలు అప్పగించనున్నట్లు సెర్ప్ తెలిపింది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!