
జనరల్

వేడిగాలుల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల నిర్వహణపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఉదయం 10 గంటలకు జరగాల్సిన పరేడ్ను 8:30 గంటలకు ముందుకు మార్చారు. పాఠశాల విద్యార్థులు, పరేడ్ బృందాల ఆరోగ్యం కాపాడేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. అధిక ఉష్ణోగ్రతల నుంచి రక్షణ కల్పించేందుకు ప్రభుత్వం జాగ్రత్త చర్యలు చేపట్టింది.
ఇటీవల ఆసిఫాబాద్లో జరిగిన సభపైనా సీఎం ప్రత్యేక దృష్టి పెట్టారు. ఎండ తీవ్రత కారణంగా సూర్యాస్తమయం తర్వాతే సభను నిర్వహించారు. సీఎం రాత్రి ఆలస్యంగా రోడ్డు మార్గంలో ప్రయాణిస్తూ, తన కాన్వాయ్ను సాధారణ వాహనాల మాదిరిగా నిర్వహించారు. ప్రజలకు అసౌకర్యం కలగకుండా కాన్వాయ్ పరిమాణాన్ని తగ్గించడంతో పాటు, తన ప్రయాణాల కోసం ట్రాఫిక్ను నిలిపివేయవద్దని అధికారులకు కఠిన ఆదేశాలు జారీ చేశారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!