
టెక్నాలజీ

పైరసీ వెబ్సైట్ ఐబొమ్మ నిర్వాహకుడు ఇమంది రవి దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లను నాంపల్లి కోర్టు కొట్టివేసింది. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లో నమోదు అయిన ఐదు కేసుల్లో బెయిల్ మంజూరు చేయాలని రవి కోర్టును ఆశ్రయించాడు. అయితే, కేసు ఇంకా దర్యాప్తు దశలోనే ఉందని పోలీసులు న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు.
ఇక, రవికి విదేశాల్లో పౌరసత్వం ఉన్నట్లు పోలీసులు పేర్కొంటూ, బెయిల్ ఇస్తే అతడు దేశం దాటి పారిపోయే అవకాశం ఉందని వాదించారు. ఈ వాదనలను పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం, కేసు తీవ్రతను దృష్టిలో ఉంచుకొని రవి దాఖలు చేసిన అన్ని బెయిల్ పిటిషన్లను తిరస్కరించింది.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!