

సంక్రాంతి పండుగను మరింత ఘనంగా నిర్వహించేందుకు తెలంగాణ పర్యాటక, సాంస్కృతిక శాఖ విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. ఈ నేపథ్యంలో మూడు రోజుల పాటు ‘ఇంటర్నేషనల్ కైట్స్ అండ్ హాట్ ఎయిర్ బెలూన్స్ ఫెస్టివల్’ ను నిర్వహించనున్నారు.
జనవరి 13 నుంచి 15 వరకు సికింద్రాబాద్లోని పరేడ్ మైదానం ఈ పతంగుల పండుగకు వేదిక కానుంది. ఈ కార్యక్రమంలో ఇండోనేషియా, స్విట్జర్లాండ్, ఆస్ట్రేలియా, శ్రీలంక, కెనడా, ఇటలీ, తైవాన్, దక్షిణాఫ్రికా, నెదర్లాండ్ వంటి దేశాల నుంచి 50 మందికి పైగా అంతర్జాతీయ కైట్ ఫ్లైయర్స్ పాల్గొననున్నారు.
అలాగే తెలంగాణతో పాటు గుజరాత్, పంజాబ్, తమిళనాడు, కేరళ, హర్యానా, ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాల నుంచి సుమారు 60 మందికి పైగా కైట్స్ క్లబ్ సభ్యులు, పతంగుల నిపుణులు ఈ వేడుకల్లో భాగస్వాములు కానున్నారు.
ఇంకా నగర శివారులోని గండిపేట ప్రాంతంలో హాట్ ఎయిర్ బెలూన్ ప్రదర్శనను కూడా ఏర్పాటు చేస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర పర్యాటక సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ వల్లూరు క్రాంతి తెలిపారు.
పరేడ్ మైదానంలో కైట్స్ ఫెస్టివల్తో పాటు జాతీయ, అంతర్జాతీయ హస్తకళల స్టాళ్లు, ప్రత్యేక వంటకాలు, సంక్రాంతి స్వీట్లు అందుబాటులో ఉండనున్నాయి. ఈ కార్యక్రమం ద్వారా నగరవాసులతో పాటు పర్యాటకులను ఆకర్షించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!