
గాసిప్స్

భారత్–అమెరికా మధ్య కుదిరిన చారిత్రాత్మక వాణిజ్య ఒప్పందాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వాగతించారు. ప్రపంచ ఆర్థిక స్థిరత్వానికి ఇది ఓ కీలక మలుపని పేర్కొన్న సీఎం, ఈ ఒప్పందాన్ని విజయవంతంగా సాధించిన ప్రధాని నరేంద్ర మోదీకి ట్వీట్ ద్వారా అభినందనలు తెలిపారు.
సుంకాలను 18 శాతానికి తగ్గించడం ప్రపంచంలోని రెండు గొప్ప ప్రజాస్వామ్య దేశాల మధ్య బంధాన్ని మరింత బలోపేతం చేస్తుందని సీఎం తెలిపారు. ప్రధాని మోదీ నాయకత్వంలో భారత్ ప్రపంచ ఆర్థిక శక్తి కేంద్రంగా తన పాత్రను స్థిరపరుచుకుంటోందని పేర్కొన్న ఆయన, ఈ ఒప్పందం భారత ఎగుమతుల్లో పోటీ తత్వాన్ని పెంచడమే కాకుండా, ఏపీతో పాటు దేశవ్యాప్తంగా యువత, రైతులకు అపారమైన అవకాశాలను కల్పిస్తుందని స్పష్టం చేశారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!