
తిరుమలలో ఈ రోజు భక్తుల రద్దీ అధికంగా కొనసాగుతోంది. తిరుమల తిరుపతి దేవస్థానం సమాచారం ప్రకారం క్యూకాంప్లెక్స్లోని 31 కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. శుక్రవారం అర్ధరాత్రి వరకు మొత్తం 66,855 మంది భక్తులు శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు.
అదే సమయంలో 26,690 మంది భక్తులు తలనీలాలు సమర్పించగా, స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.82 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తుండగా, దర్శన టికెట్లు లేని భక్తులు స్వామివారిని దర్శించుకోవడానికి సుమారు 18 గంటల వరకు వేచి ఉండాల్సి వస్తోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన భక్తులు దాదాపు మూడు గంటల్లో స్వామివారిని దర్శించుకుంటున్నారు.








.png&w=3840&q=75)

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!