
న్యూస్

రాష్ట్రంలో వాతావరణ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ఉత్తరాంధ్రలో వడగాలుల తీవ్రత పెరగనున్నట్లు అధికారులు హెచ్చరించారు. విశాఖ, అనకాపల్లి, కాకినాడ, అంబేద్కర్ కోనసీమ జిల్లాల్లో వేడి గాలులు వీచే అవకాశం ఉండగా, రాయలసీమ ప్రాంతంలో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని తెలిపారు. ప్రజలు అవసరం లేకుండా బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించారు.
ఇక అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో అకాల వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ పేర్కొంది. అక్కడక్కడా పిడుగులతో కూడిన వర్షాలు పడే సూచనలు ఉన్నాయని, రైతులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. వాతావరణ మార్పుల దృష్ట్యా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!