
న్యూస్

తెలంగాణ ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగులకు 2.1 శాతం డీఏ పెంపును ప్రకటించింది. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ విషయాన్ని వెల్లడిస్తూ, ప్రస్తుతం ఉన్న 50.7% డీఏను 52.8%కు పెంచినట్లు తెలిపారు. ఈ పెంపు 2026 జనవరి 1 నుంచి అమల్లోకి వస్తుంది. గడిచిన మూడు నెలల బకాయిలను సప్లిమెంటరీ బిల్లుల ద్వారా చెల్లించనున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. ఈ నిర్ణయంతో ప్రతి నెల ఆర్టీసీపై రూ.2.82 కోట్ల అదనపు భారం పడనుంది.
ఈ నిర్ణయాన్ని వై నాగిరెడ్డి సహా ఉన్నతాధికారులు స్వాగతించారు. ఉద్యోగుల సంక్షేమం, సంస్థ అభివృద్ధి, ప్రయాణికుల సౌలభ్యం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి స్పష్టం చేశారు. ఆసుపత్రుల అభివృద్ధి, కారుణ్య నియామకాలు, కొత్త ఉద్యోగాల భర్తీ, కొత్త బస్సుల కొనుగోలు వంటి చర్యలు కొనసాగుతాయని తెలిపారు. పెండింగ్ పనులను వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశించారు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!