
రాజకీయాలు

ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ తన తల్లి సువర్ణలతను కోల్పోయారు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతూ ఆమె 86 ఏళ్ల వయసులో సోమవారం ఉదయం బెంగళూరులోని స్వగృహంలో కన్నుమూశారు. అదే రోజు సాయంత్రం ఆమె అంత్యక్రియలు బెంగళూరులో క్రైస్తవ సంప్రదాయాల ప్రకారం నిర్వహించారు.
అయితే, ప్రకాష్ రాజ్ తనను తాను నాస్తికుడిగా ప్రకటించుకున్న నేపథ్యంలో అంత్యక్రియలపై సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. దీనిపై స్పందించిన ఆయన, తనకు దేవుడిపై నమ్మకం లేకపోయినా తన తల్లికి తనదైన విశ్వాసం ఉందని, ఆమె నమ్మకాల ప్రకారం అంత్యక్రియలు నిర్వహించడం తన బాధ్యత అని తెలిపారు. ప్రతి ఒక్కరి నమ్మకాలను గౌరవించడం కనీస మానవత్వమని ఆయన ఘాటుగా స్పందించారు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!