

పాకిస్థాన్ బ్యాట్స్మెన్ బాబర్ ఆజం కింగ్ విరాట్ కోహ్లీని అధిగమించాడు. ప్రస్తుతం జరుగుతున్న పాకిస్థాన్ సూపర్ లీగ్ (PSL) 2026లో పెషావర్ జల్మీ జట్టుకు బాబర్ ఆజం కెప్టెన్గా వ్యవహరిస్తున్నాడు. కరాచీ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో ఆయన టీ20 క్రికెట్లో చరిత్ర సృష్టించాడు. కేవలం 338 ఇన్నింగ్స్ల్లోనే 12,000 పరుగుల మైలురాయిని చేరుకుని, ఈ ఘనతను అత్యంత వేగంగా సాధించిన ఆటగాడిగా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. తన కెరీర్లో 351వ మ్యాచ్ ఆడుతున్న బాబర్, ఈ మైలురాయిని అతి తక్కువ ఇన్నింగ్స్ల్లోనే చేరుకోవడం విశేషం. గతంలో ఈ రికార్డు వెస్టిండీస్ దిగ్గజం క్రిస్ గేల్ (343 ఇన్నింగ్స్లు) పేరిట ఉండగా, టీమిండియా స్టార్ విరాట్ కోహ్లీ (360 ఇన్నింగ్స్లు) మూడో స్థానంలో ఉన్నాడు. ఈ రికార్డు సాధించిన రెండో పాకిస్థానీ బ్యాటర్గా బాబర్ నిలిచాడు.
ఈ మ్యాచ్లో ఓపెనర్గా బరిలోకి దిగిన బాబర్ ఆజం 51 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్సర్లతో 87 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. కుశాల్ మెండిస్తో కలిసి రెండో వికెట్కు 191 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. దీంతో పెషావర్ జల్మీ 20 ఓవర్లలో 246/3 పరుగుల భారీ స్కోరు సాధించింది. అనంతరం 247 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కరాచీ కింగ్స్ జట్టు పెషావర్ బౌలర్ల ధాటికి పూర్తిగా కుప్పకూలింది. ఇఫ్తికార్ అహ్మద్, షోరిఫుల్ ఇస్లాం, సుఫియాన్ ముఖీమ్ తలా మూడు వికెట్లు తీసి అద్భుతంగా రాణించారు. ఫలితంగా కరాచీ కింగ్స్ కేవలం 87 పరుగులకే ఆలౌట్ కాగా, పెషావర్ జల్మీ ఘన విజయాన్ని నమోదు చేసింది.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!