

రాజమహేంద్రవరంలో జరిగే గోదావరి పుష్కరాలు 2027 కోసం విస్తృత ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. జూన్ 26 నుండి జూలై 7 వరకు జరగనున్న ఈ మహోత్సవాన్ని దృష్టిలో ఉంచుకుని పలు అభివృద్ధి పనులు చేపట్టారు. రూ.9.55 కోట్లతో 6 దేవాలయ సముదాయాల నిర్మాణానికి శంకుస్థాపన చేయగా, భక్తుల నివాస సౌకర్యాల కోసం రూ.23.65 కోట్లతో 18 కాటేజీలు నిర్మిస్తున్నారు. అలాగే గోదావరి పరివాహక ప్రాంతాల్లో రూ.23 కోట్లతో 18 అభివృద్ధి పనులు చేపట్టారు. వడపల్లి వద్ద రూ.12 కోట్లతో “శ్రీనివాస నిలయం” భవనానికి శంకుస్థాపన చేయడంతో పాటు, కోటిలింగాల పేటలో సత్రాలు, అన్నదానం హాళ్లు, యాత్రికుల సౌకర్యాల నిర్మాణం జరుగుతోంది.
అంబేద్కర్ కోనసీమ జిల్లా పర్యటనలో భాగంగా వడపల్లి, మండపల్లి దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అక్కడ అన్నదానం హాళ్లు, తైలాభిషేక మండపాలు నిర్మిస్తున్నారు. “ధూప దీప నైవేద్యం” పథకం కింద 202 దేవాలయాలకు నెలకు రూ.10,000 ఆర్థిక సహాయం అందిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖులు దగ్గుబాటి పురంధేశ్వరి, ఆదిరెడ్డి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!