

మహిళా బిల్లుకు ప్రతి ఒక్కరూ మద్దతు ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ విషయాన్ని ప్రధాని నరేంద్ర మోదీని ట్యాగ్ చేస్తూ ఆయన ఎక్స్లో పోస్టు చేశారు. లోక్సభ సీట్ల పెంపు విషయంలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. దీనిపై అఖిలపక్ష సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోవాలని సూచించారు. లోక్సభ సీట్ల పెంపు, మహిళా రిజర్వేషన్లు రెండు వేర్వేరు అంశాలని ప్రతి పౌరుడు అర్థం చేసుకోవాలని చెప్పారు. అసెంబ్లీ సీట్లలో మహిళా రిజర్వేషన్లు అమలు చేస్తే దేశవ్యాప్తంగా అందరూ స్వాగతిస్తారని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే మహిళా రిజర్వేషన్ల పేరుతో జనాభా ఆధారంగా లోక్సభ సీట్లను పెంచాలని బీజేపీ ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు.
రిజర్వేషన్లు, డీలిమిటేషన్ అంశాలపై ప్రధాని మోదీకి సీఎం రేవంత్ రెడ్డి లేఖ రాశారు. మహిళా రిజర్వేషన్లు మరియు డీలిమిటేషన్ రెండు వేర్వేరు అంశాలని ఆయన స్పష్టం చేశారు. మహిళా కోటాను తక్షణమే అమలు చేస్తే దేశమంతా స్వాగతిస్తుందని ఆయన పేర్కొన్నారు. డీలిమిటేషన్ వల్ల దక్షిణాది రాష్ట్రాలతో పాటు చిన్న రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని ఆయన హెచ్చరించారు. లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన బీజేపీకి లాభం చేకూర్చవచ్చని ఆయన వ్యాఖ్యానించారు. పార్టీ ప్రయోజనాల కంటే జాతీయ ప్రయోజనాలే ముఖ్యమని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!