

దక్షిణ కొరియా మొబైల్ తయారీ దిగ్గజం శాంసంగ్ మరోసారి తన స్మార్ట్ఫోన్ ధరలను పెంచింది. ఇప్పటికే ఫిబ్రవరి నెలలో ఎంట్రీ లెవల్ మరియు మిడ్ రేంజ్ ఫోన్లపై ధరలు పెంచిన సంస్థ, తాజాగా మరికొన్ని ఎంపిక చేసిన మోడళ్లపై ధరలను సవరించింది. గెలాక్సీ A, F సిరీస్కు చెందిన పలు స్మార్ట్ఫోన్లు ఈ పెంపులో ఉన్నాయి. టిప్స్టర్ అభిషేక్ యాదవ్ ఈ ధరల వివరాలను ఎక్స్ ప్లాట్ఫామ్లో షేర్ చేయగా, పెరిగిన ధరలు నేటి నుంచే అమల్లోకి వచ్చినట్లు తెలుస్తోంది.
వివరాల ప్రకారం గెలాక్సీ A06 ధరను రూ.1000 పెంచి బేస్ వేరియంట్ను రూ.13,499కు తీసుకెళ్లారు. గెలాక్సీ A07పై రూ.1250 పెంపుతో దీని ప్రారంభ ధర రూ.10,999గా ఉంది. గెలాక్సీ A17పై వేరియంట్ను బట్టి రూ.1000 నుంచి రూ.1500 వరకు పెరిగి, టాప్ వేరియంట్ రూ.27,999కు చేరింది. అలాగే గెలాక్సీ A36పై రూ.1500 నుంచి రూ.3000, గెలాక్సీ A56పై రూ.2000 నుంచి రూ.3500 వరకు ధరలు పెరిగాయి. మరోవైపు, ఇటీవల గెలాక్సీ M36, F36 మోడళ్లపై రూ.1000, గెలాక్సీ M06, F06పై రూ.1500 నుంచి రూ.2000, గెలాక్సీ M07, F07 మోడళ్లపై రూ.1900 వరకు ధరలను పెంచిన విషయం తెలిసిందే. ఈ మార్పులు ఏప్రిల్ 8 నుంచే అమల్లోకి వచ్చాయి.














.jpeg&w=3840&q=75)







కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!