

ఇరాన్ తన వైఖరిలో ఎలాంటి మార్పు లేకుండా, తాను విధించిన షరతులు అమలు చేసినప్పుడే చర్చలు జరుపుతామని స్పష్టం చేసింది. పాకిస్తాన్ వేదికగా జరగాల్సిన అమెరికా-ఇరాన్ చర్చలపై అనిశ్చితి నెలకొంది. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఇస్లామాబాద్కు చేరుకుని గంటలైనా, ఇరాన్ ప్రతినిధులతో ప్రత్యక్ష సమావేశం జరగలేదని సమాచారం. ఈ నేపథ్యంలో నేరుగా చర్చలు జరిగే అవకాశాలు తక్కువగా కనిపిస్తుండగా, పాకిస్తాన్ ద్వారా పరోక్ష చర్చలు ప్రారంభమయ్యే అవకాశం ఉందని అంచనాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, ఆ ప్రక్రియకు కూడా ఇరాన్ కొన్ని కీలక షరతులు విధించినట్లు తెలుస్తోంది.
ఇప్పటికే పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ జేడీ వాన్స్తో సమావేశమయ్యారు. అలాగే పాక్ ఉన్నతాధికారులు అమెరికా, ఇరాన్ ప్రతినిధులతో వేర్వేరుగా చర్చలు జరిపినట్లు సమాచారం. ఈ సమావేశాల్లో ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బాఘెర్ మరియు విదేశాంగ మంత్రి అరాగ్చీ పాల్గొన్నారు. చర్చలు ప్రారంభం కావాలంటే ముందుగా లెబనాన్పై దాడులు ఆగాలని, ఇజ్రాయెల్-లెబనాన్ మధ్య కాల్పుల విరమణ జరగాలని ఇరాన్ స్పష్టం చేసింది. అదనంగా, ఖతార్ సహా ఇతర దేశాల్లో స్తంభింపచేసిన తమ ఆస్తులపై ఆంక్షలను వెంటనే ఎత్తేయాలని కూడా డిమాండ్ చేసింది. ఈ పరిస్థితుల్లో యూఎస్, పాకిస్తాన్, ఇరాన్ మధ్య చర్చలు ఎలా ముందుకు సాగుతాయో అన్నదానిపై అంతర్జాతీయంగా ఆసక్తి నెలకొంది.














.jpeg&w=3840&q=75)







కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!