
న్యూస్

ఆసియా బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ ఫైనల్లో భారత యువ షట్లర్ ఆయుష్ శెట్టి స్వర్ణం గెలిచే అవకాశాన్ని త్రుటిలో కోల్పోయి రజతంతో సరిపెట్టుకున్నాడు. పెద్దగా అంచనాల్లేకుండా టోర్నీలో అడుగుపెట్టిన ఆయన అద్భుత విజయాలతో ఫైనల్కు చేరి అందరినీ ఆకట్టుకున్నాడు.
ఫైనల్లో చైనా ఆటగాడు షీ యుకీ చేతిలో ఆయుష్ 8-21, 10-21 తేడాతో వరుస గేముల్లో ఓడిపోయాడు. 42 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్లో ప్రపంచ నంబర్ 2 షట్లర్ పూర్తిగా ఆధిపత్యం చూపించాడు. అయినప్పటికీ టోర్నీ అంతటా ఆయుష్ ప్రదర్శన విశేషంగా నిలిచింది.
భారత పురుషుల సింగిల్స్లో ఆసియా స్థాయిలో స్వర్ణం కోసం ఉన్న 61 ఏళ్ల నిరీక్షణ ఇంకా కొనసాగుతోంది. 1965లో దినేశ్ ఖన్నా తర్వాత ఇప్పటివరకు భారత్కు ఈ టైటిల్ రాలేదు. అయితే ఆయుష్ శెట్టి ప్రదర్శన భవిష్యత్తుపై కొత్త ఆశలను రేకెత్తించింది.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!