

రాజస్థాన్ రాయల్స్ జట్టు మేనేజర్ రోమి భిందర్ పై వివాదం నెలకొంది. ఇటీవల జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన పోరులో అతను డగౌట్లో మొబైల్ ఫోన్ ఉపయోగించిన దృశ్యాలు బయటకు వచ్చాయి. అతడి పక్కనే కూర్చున్న యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ కూడా ఫోన్ వైపు చూసినట్లు కనిపించడం వైరల్ అయింది.
మ్యాచ్ జరుగుతున్న సమయంలో డగౌట్లో మొబైల్ వాడటం నిబంధనలకు విరుద్ధం. ఇది అవినీతి నిరోధక మరియు భద్రతా నియమాలను ఉల్లంఘించినట్లే భావిస్తారు. ఈ నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి చర్యలకు దిగింది. యాంటీ కరప్షన్ విభాగం రోమి భిందర్కు నోటీసులు జారీ చేసి, 48 గంటల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఈ విషయాన్ని ఐపీఎల్ ఛైర్మన్ అరుణ్ ధుమాల్ ధృవీకరించారు.
ఇక రోమి భిందర్కు దగ్గర వర్గాల సమాచారం ప్రకారం, అతనికి ఆరోగ్య సమస్యలు ఉన్నాయని చెబుతున్నారు. అతనికి శ్వాస సమస్య ఉండడంతో పాటు ఇటీవల బరువు కూడా తగ్గిందని తెలిపారు. వైద్యుల సూచనల ప్రకారం మెట్లు ఎక్కడం తగ్గించాలని చెప్పడంతో, అతను అక్కడే కూర్చుని ఫోన్ చూసినట్లు సమాచారం. అతను కాల్స్ మాట్లాడలేదు, కేవలం ఫోన్ చూసినంత మాత్రమే అని అంటున్నారు. ఈ విషయాలను విచారణలో పరిగణలోకి తీసుకుంటారని భావిస్తున్నారు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!