
న్యూస్

రాజమహేంద్రవరంలోని ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయంలో శనివారం వందేమాతరం గీతం ప్రారంభమై 150 ఏళ్లు పూర్తైన సందర్భంగా ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పర్యాటక మంత్రి దుర్గేష్ హాజరై ప్రసంగించారు.
వందేమాతరం గీతం దేశభక్తి, ఐక్యతకు ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్న మంత్రి, ఆ స్ఫూర్తిని తరతరాలకు అందించే బాధ్యత ప్రతి ఒక్కరిపైనే ఉందన్నారు. యువతలో దేశభక్తి భావాలను మరింత బలపరిచేలా ఇటువంటి కార్యక్రమాలు దోహదపడతాయని తెలిపారు.
ఈ సందర్భంగా స్టూడెంట్ యునైటెడ్ నెట్వర్క్ సంస్థ అధ్యక్షుడు బసవ కృష్ణమూర్తి ఆధ్వర్యంలో రూపొందించిన 25 వేల చదరపు అడుగుల భారీ త్రివర్ణ పతాకాన్ని విశ్వవిద్యాలయ ప్రాంగణంలో ప్రదర్శించారు. ఈ త్రివర్ణ పతాక ర్యాలీ అందరి దృష్టిని ఆకర్షిస్తూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.








.avif&w=3840&q=75)






కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!