

విశాఖపట్నాన్ని ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దే దిశగా భారీ ప్రాజెక్టు రానుంది. సుమారు రూ.1.35 లక్షల కోట్ల పెట్టుబడితో గూగుల్ సంస్థ విశాఖలో మెగా డేటా సెంటర్తో పాటు ఏఐ హబ్ను ఏర్పాటు చేయనుంది. ఈ ప్రాజెక్టుకు ఈ నెల 28న ముఖ్యమంత్రి చంద్రబాబు శంకుస్థాపన చేయనున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా విశాఖ ఐటీ రంగంలో హైదరాబాద్, బెంగళూరు, చెన్నై నగరాల సరసన నిలిచే అవకాశముంది.
ఈ కేంద్రం కేవలం డేటా నిల్వకు మాత్రమే కాకుండా, ఏఐ ఆధారిత సేవల కోసం సమగ్ర మౌలిక వసతులతో కూడిన హబ్గా రూపుదిద్దుకోనుంది. భారీ స్థాయిలో డేటా స్టోరేజీ, వేగవంతమైన కమ్యూనికేషన్ సదుపాయాలు, అంతర్జాతీయ కనెక్టివిటీతో విశాఖ ఆసియాలో కీలక డిజిటల్ కేంద్రంగా మారే అవకాశం ఉంది. ఈ ప్రాజెక్టు వల్ల అనేక సాంకేతిక సంస్థలు విశాఖకు ఆకర్షితమయ్యే పరిస్థితి ఏర్పడుతుంది.
ఈ ప్రాజెక్టుతో పెద్దఎత్తున ఉద్యోగావకాశాలు కలుగనున్నాయి. సాఫ్ట్వేర్, డేటా సైన్స్, కృత్రిమ మేధస్సు, నెట్వర్కింగ్ వంటి రంగాల్లో నిపుణులకు అవకాశాలు లభిస్తాయి. నిర్మాణ దశలో కూడా వేల మందికి ఉపాధి దొరుకుతుంది. అదనంగా చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, రియల్ ఎస్టేట్, రవాణా, ఆతిథ్య రంగాలకు కూడా ఈ ప్రాజెక్టు ఊతం ఇస్తుంది.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!