

తెలంగాణ రాష్ట్రంలో ఐఏఎస్ అధికారుల విస్తృత బదిలీలు చోటుచేసుకున్నాయి. పరిపాలనలో సమర్థత పెంపు లక్ష్యంగా ప్రభుత్వం పలు కీలక నియామకాలు చేసింది. సంజయ్ కుమార్ను తెలంగాణ భవన్ ప్రత్యేకాధికారిగా నియమించగా, ఆర్అండ్బీ శాఖ ప్రత్యేక కార్యదర్శిగా ప్రావీణ్య బాధ్యతలు స్వీకరించనున్నారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా దానకిషోర్ను నియమించారు.
ఇదే సందర్భంగా పరిశ్రమల శాఖ ప్రత్యేక కార్యదర్శిగా కృష్ణ ఆదిత్యను నియమించగా, గిరిజన సంక్షేమశాఖ ప్రత్యేక కార్యదర్శిగా బి.ఎం. సంతోష్ను నియమించారు. ఇంటర్ బోర్డు డైరెక్టర్గా అభిలాష్ అభినవ్ బాధ్యతలు చేపట్టనున్నారు. పౌరసరఫరాల శాఖ డైరెక్టర్గా జి.వి. శ్యామ్ ప్రసాద్లాల్ను నియమించారు. అలాగే ఐ అండ్ పీఆర్ ప్రత్యేక కమిషనర్గా జి. ముకుంద్ రెడ్డి నియామకం జరిగింది.
హైదరాబాద్ కలెక్టర్గా ఉన్న దాసరి హరిచందనను బదిలీ చేసి, కార్మికశాఖ ప్రత్యేక కార్యదర్శిగా నియమించారు. ఈ బదిలీలతో రాష్ట్ర పరిపాలనలో మరింత వేగం, సమన్వయం సాధించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!