

ఇన్ఫినిక్స్ సంస్థ తమ కొత్త గేమింగ్ స్మార్ట్ఫోన్ జీటీ 50 ప్రోను గ్లోబల్ మార్కెట్లో విడుదల చేసింది. గత సంవత్సరం వచ్చిన జీటీ 30 ప్రోకు ఇది సక్సెసర్గా వస్తోంది. ఈ ఫోన్లో శక్తివంతమైన మీడియాటెక్ డైమెన్సిటీ 8400 అల్టిమేట్ ప్రాసెసర్ను అమర్చారు. 12 జీబీ ర్యామ్తో పాటు 256 జీబీ, 512 జీబీ స్టోరేజ్ వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. గేమింగ్ అనుభవాన్ని మెరుగుపరచడానికి ప్రత్యేకంగా ప్రెషర్ సెన్సిటివ్ షోల్డర్ ట్రిగర్స్ను అందించారు.
ధర పరంగా చూస్తే, 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర సుమారు రూ.35,000గా ఉండగా, 512 జీబీ స్టోరేజ్ వేరియంట్ సుమారు రూ.40,000 వరకు ఉంటుంది. ఈ ఫోన్ బ్లాక్, రెడ్, సిల్వర్ రంగుల్లో లభిస్తుంది. 6.78 అంగుళాల అమెఓఎల్ఈడి డిస్ప్లేతో 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ అందించగా, అత్యధిక ప్రకాశం మరియు మెరుగైన కలర్ క్వాలిటీని అందిస్తుంది.
కెమెరా పరంగా 50 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాతో పాటు 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా అందించారు. సెల్ఫీల కోసం 13 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. 6,500 ఎంఏహెచ్ భారీ బ్యాటరీతో 45 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్, వైర్లెస్ ఛార్జింగ్, రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. అదనంగా హైడ్రోఫ్లో లిక్విడ్ కూలింగ్ సిస్టమ్, ప్రత్యేక నెట్వర్క్ మేనేజ్మెంట్ చిప్ వంటి ఫీచర్లు గేమింగ్ పనితీరును మరింత మెరుగుపరుస్తాయి.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!